‘జైసింహా’ మూవీ ఆఫీస్‌పై ఐటీ దాడులు

Update: 2018-01-17 08:26 GMT

నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం జై సింహాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ సినిమా జనవరి 12న విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమాను కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో సి.కల్యాణ్ నిర్మించారు. ప్రస్తుతం ‘జై సింహా’కు పోటీనిచ్చే సినిమా ఏదీ లేకపోవడంతో ఈ సినిమాకు  థియేటర్లు భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. కాగా, ఈ నేపథ్యంలో ‘జైసింహా’ కార్యాలయంపై ఐటీ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. హైదరాబాద్ కృష్ణానగర్‌లోని నిర్మాత సీ కల్యాణ్ కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్నారు.
 

Similar News