ఏపీలో మరోసారి ఐటీ దాడుల కలకలం రేగింది. సీఎం చంద్రబాబు కోటరిలోని అత్యంత కీలకమైన వ్యక్తిగా ఉన్న సీఎం రమేష్పై ఐటీ దాడులు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్లోని ఆయన సంస్ధలు, నివాసంతో పాటు సొంత గ్రామం కడప జిల్లా పోట్లదుర్తిలో ప్రత్యేక బృందాలు సోదాలు చేపట్టాయి. తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో కడప జిల్లాకు చేరుకున్న ఐటీ అధికారులు నేరుగా సీఎం రమేష్ నివాసానికి చేరుకుని .. తనిఖీలు చేపట్టారు. ఇదే సమయంలో హైదరాబాద్లోని సీఎం రమేష్ నివాసం, రిత్విక్ ప్రాజెక్టు ప్రయివేటు లిమిటెడ్ కార్యాలయాల్లో సోదాలు చేపట్టారు . ఈ సందర్భంగా పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.