చంద్రగ్రహణం.. ఏపీలో నరబలికి యత్నం..

Update: 2018-07-28 02:03 GMT

ఖగోళ అద్భుతాన్ని ప్రపంచం వీక్షిస్తుంటే కృష్ణా జిల్లాలో మాత్రం మంత్రగాళ్లు రెచ్చిపోయారు. అతీత శక్తుల వస్తాయంటూ  కొందరు వ్యక్తులు నరబలి ఇచ్చేందుకు సిద్దమయ్యారు. మాయమాటలతో ఓ యువకుడిని నరబలి ఇచ్చేందుకు ప్రయత్నించారు.    

సంపూర్ణ చంద్ర గ్రహణం రోజున కృష్ణాజిల్లాలో క్షుద్రపూజల ఘటన తీవ్ర కలకలం రేపింది. నూజివీడు మండలం యనమదల కొందరు మంత్రగాళ్లు క్షుద్రపూజలకు సిద్ధమయ్యారు. వంద సంవత్సరాలకు ఓ సారి వచ్చే ఇలాంటి రోజున నరబడి ఇస్తే అతీత శక్తులు వస్తాయంటూ ఓ యువకుడిని బలిచ్చేందుకు గ్రామ పొలిమేర్లలోకి తీసుకొచ్చారు. పొలాల్లోకి వచ్చిన తరువాత పరిస్దితి తెలుసుకున్న యువకుడు చాకచక్యంగా  మంత్రగాళ్ల నుంచి తప్పించుకున్నాడు.

గ్రామంలోకి వెళ్లి జరిగిన విషయాన్ని తెలియ జేయడంతో ఈ ఘటన వెలుగు చూసింది. వెంటనే అప్రమత్తమైన గ్రామస్తులు ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. హుటాహుటినా ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మంత్రగాళ్ల ఆచూకిపై ఆరా తీశారు. అప్పటికే మంత్రగాళ్లు పరారి కావడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 

Similar News