పశ్చిమగోదావరి జిల్లాలో ఫ్లెక్సీల వివాదం...పవన్ సభకు వెళ్తే 50 వేల జరిమానా
పశ్చిమగోదావరి జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఏలూరు రూరల్ మండలం గుడివాడలంక గ్రామంలో పవన్ సభకోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించారు. అంతేకాకుండా.. పవన్ సభపై గుడివాడలంక గ్రామపెద్దలు బెదిరింపులకు దిగుతున్నారు. పవన్ సభకు వెళ్తే.. 50 వేల జరిమానా విధిస్తామంటూ గ్రామపెద్దలు.. హెచ్చరిస్తున్నారు. దీంతో పవన్ పార్టీకి చెందిన జనసైనికులు.. గుడివాడలంక గ్రామపెద్దలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నాయకుల ప్రోద్బలంతోటే.. పవన్పై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని.. మండిపడుతున్నారు.