పూనమ్ కౌర్ తన 6 ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు కత్తి మహేష్. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్మీట్ పెట్టిన ఆయన.. పవన్ ఫ్యాన్స్ తనపై సామాజిక దాడి చేశారన్నారు. ఈసందర్భంగా పవన్ -తాంత్రిక పూజలు ఎందుకు నిర్వహించారోనంటూ ఆరు ప్రశ్నలు సంధించారు. వాటిలో ఒక ప్రశ్నకు సమాధానం దొరికినట్లు తెలుస్తోంది.
పూనమ్ కౌర్ కు సంధించిన ఆ ఆరు ప్రశ్నలలో
1. మీకు ఏపీ చేనేత బ్రాండ్ అంబాసిడర్ పదవి ఎవరి వల్ల వచ్చింది?
2. తిరుమలలో పవన్ పక్కనే నిల్చొని ఒకే గోత్రనామాలతో ఎందుకు పూజ చేయించుకున్నారు?
3. పవన్ మోసం చేశాడనే బాధతో మీరు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తే మిమ్మల్ని కాపాడింది ఎవరు? మీరు ఉన్న ఆసుపత్రి ఏది? ఆ బిల్స్ కట్టింది ఎవరు?
4. పవన్ కల్యాణ్ గారు మీ అమ్మగారిని కలిసి ఏం ప్రామిస్ చేశారు? ఇప్పటివరకు అది నెరవేర్చారా? లేదా?
5. డైరెక్టర్ త్రివిక్రమ్ అంటే మీకు ఎందుకంత కోపం?
6. క్షుద్రమాంత్రికుడు నర్సిహం చేసిన పూజల్లో త్రివిక్రమ్, పవన్, మీరు ఎందుకు పాల్గొన్నారు? అక్కడ మీరు ఏం చేశారు?
ఈ ఆరు ప్రశ్నలకు పూనమ్ కౌర్ సమాధానం చెప్పిన తర్వాతే దీనిపై చర్చ పెట్టుకుందామని తాను అనుకుంటున్నట్లు కత్తి మహేష్ చెప్పారు.
ఆరు ప్రశ్నల్లో క్షుద్రపూజలపై సమాధానం
అయితే ఈ ఆరు ప్రశ్నల్లో క్షుద్రపూజలపై సమాధానం దొరికింది. ఓ మీడియా ఛానల్ నిర్వహించిన లైవ్ లో అవి క్షుద్రపూజలు కాదని మహేష్ చెప్పిన పూజారి నర్సింహం అన్నారు. జల్సా షూటింగ్ సమయంలో ద్వారాకా తిరుమల ఐఎస్ జగన్నాథపురం లక్ష్మీ నరసింహా స్వామి దేవాలయంలో పూజలు జరిపించారని అన్నారు. ఆ టెంపుల్ ప్రత్యేకత 24గంటలు పూజలు, యాగాలు చేయోచ్చని ..పవన్ కల్యాణేకాదు , మహేష్ బాబు, పలు ప్రముఖులు పూజలు చేస్తారని అన్నారు. అంతేకాదు అక్కడ నర్సింహాయాగం 24గంటలు చేసే సౌకర్యం ఉంది. మిడ్ నైట్ లో చేస్తే ఫలితం ఎక్కువగా ఉంటుందని , ఉదయం పూట అయితే స్టార్ డమ్ ఇబ్బందిగా ఉంటుందని నైట్ టైంలో చేస్తారన్నారు. ఆ సమయంలో పూజారి నరసింహా దగ్గరుండి పవన్ కల్యాణ్ , త్రివిక్రమ్ లతో ఆ పూజ చేయించినట్లు పూర్థి ఆధారాలతో వెలుగులోకి వచ్చింది. ఇదిలా ఉంటే మహేష్ క్షుద్రపూజల గురించి మాట్లాడే సమయంలో జర్నలిస్ట్ లు కొన్ని ప్రశ్నలు సంధించారు. ఆ ప్రశ్నల గురించి తప్పించుకునే ప్రయత్నం చేసి పూనమ్ కౌర్ గురించి ప్రస్తావించారు.