కొందరు దర్శకులు, నిర్మాతలు తనతో అసభ్యకరంగా ప్రవర్తించారంటూ ఆరోపణలు చేస్తూ ఓ తెలుగు నటి సోషల్మీడియాలో సంచలనాత్మక పోస్ట్లు పెడుతున్నారు. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ములను కూడా ఉద్దేశిస్తూ సోమవారం ఆమె ఓ పోస్ట్ పెట్టారు. దీనిపై శేఖర్ కమ్ముల సీరియస్గా స్పందించారు. పిచ్చిపిచ్చి వేషాలు వేస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవలసి వస్తుందని హెచ్చరించారు. 'నన్ను కించపరుస్తూ, సోషల్ మీడియాలో నిన్న వచ్చిన పోస్ట్, నా దృష్టికి వచ్చింది. ఆ పోస్ట్ లో ప్రతీ మాట అబద్ధం. అసభ్యం. అవమానకరం. ఆ పోస్ట్ నాకు, నా కుటుంబానికి, నన్ను గౌరవించేవారికి చాలా మనస్థాపం కలిగించింది.
నేను ఎప్పుడూ కలవని, అసలు చూడనే చూడని, కనీసం ఫోన్లో కుడా మాట్లాడని అమ్మాయి , నా గురించి ఆధారం లేని ఆరోపణలు చేయటం షాకింగ్ గా ఉంది. ఈ దిగజారుడు చర్య వెనక ఎవరున్నా, వారి ఉద్దేశం ఏమైనా, నేను చెప్పదల్చుకున్నది ఒకటే. ఇది తప్పు, నేరం, అనైతికం.'అంటూ శేఖర్ కమ్ముల హెచ్చరించారు. స్త్రీ ల సమానత్వం, సాధికారతలని నేను ఎంత నమ్ముతానో నా సినిమాలు, నా కార్యక్రమాలు చూస్తే అర్ధమౌతుంది. నా వ్యక్తిత్వం, నమ్మే విలువలు నా ప్రాణం కంటే ముఖ్యం. వాటి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తే, వదిలి పెట్టే ప్రసక్తి లేదు. ఆ పోస్ట్ లోని ప్రతీ మాట తప్పు అని ఒప్పుకొని, క్షమాపణ చెప్పకపోతే, చట్టపరంగా చర్యలు తీసుకుంటాను.
APOLOGIZE and take back every word that was posted against me or be ready to face legal action, which will include criminal/civil proceedings.
— Sekhar Kammula (@sekharkammula) April 3, 2018
People who know me and my work would be aware of the kind of importance I give to equality of women and their empowerment. I live by my CHARACTER and die by it. I will not spare anyone who tries to point fingers at it.
— Sekhar Kammula (@sekharkammula) April 3, 2018
Whatever might be their intentions and whoever might be involved in this diabolic act , I would like to say that it is WRONG, IMMORAL and CRIMINAL
— Sekhar Kammula (@sekharkammula) April 3, 2018