ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా తెలుగు టీవీ ప్రేక్షకులను రియాలిటీ షో 'బిగ్ బాస్' ఎంతగా అలరించిందో అందరికీ తెలిసిందే. ఈ కార్యక్రమానికి మంచి రెస్పాన్స్, టీఆర్పీ రేటింగ్స్ రావడంతో, రెండో సీజన్ ను జూన్ 10 నుంచి ప్రారంభించాలని నిర్వాహకులు నిర్ణయించారు. రెండో సీజన్ కు హీరో నాని యాంకర్ గా వ్యవహరించనుండగా, 100 రోజుల పాటు, 16 మంది సెలబ్రిటీలు బిగ్ బాస్ లో గడపనున్నారు. ఇందుకోసం హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోలో అన్ని హంగులతో కూడిన సెట్ ఇప్పటికే పూర్తయింది. బిగ్బాస్ 2 సెట్లో కంటెస్టంట్స్కు మంచి సౌకర్యాలు కూడా అందుబాటులో ఉంచనున్నారని టాక్. అంతేకాకుండా సీజన్ 2కు ప్రైజ్మనీని భారీ మొత్తంలో పెంచనున్నట్లు తెలుస్తోంది. ప్రతి శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు, ప్రతి సోమ, శుక్ర వారాల్లో రాత్రి 9.30 గంటలకు ఈ కార్యక్రమం ప్రసారం కానుంది. అయితే ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసే హౌజ్ మేట్స్కి సంబంధించిన లిస్ట్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది
- హీరో రాజ్ తరుణ్
- సింగర్ గీతా మాధురి
- యాంకర్ శ్యామల
- యాంకర్ లాస్య
- హీరోయిన్ రాశి
- హీరోయిన్ చార్మి కౌర్
- ధన్య బాలకృష్ణ
- జూనియర్ శ్రీదేవి
- హీరోయిన్ గజాలా
- చాందిని చౌదరి
- శ్రీ రెడ్డి
- వరుణ్ సందేశ్
- థనీష్
- వైవా హర్షా
- కమెడీయన్ వేణు
- ఆర్యన్ రాజేష్
ఈ పదహారు మంది కంటెస్టెంట్స్ సీజన్ 2లో పాల్గొననున్నారని తెలుస్తుండగా, దీనిపై అఫీషియల్ ప్రకటన రావలసి ఉంది. ఈ మధ్య సోషల్ మీడియాలో సంచలన పోస్ట్ లు చేసిన శ్రీ రెడ్డి ఇందులో భాగం కావడం అనే వార్త అందరికి షాకింగ్గా మారింది. శ్రీ రెడ్డి నేచురల్ స్టార్ నాని, వైవా హర్షాలపై సంచలన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.