హాస్యనటుడు మహేష్ గత కొంత కాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతూ.. కిమ్స్ హాస్పిటల్ లో కన్నుమూశారు. దాదాపు వందకు పైగా చిత్రాల్లో మహేష్ హాస్య నటుడిగా తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మహేశ్ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సినిమాలతో పాటు, బుల్లితెర సీరియళ్లలో కూడా నటించి మెప్పించారు. కాగా మహేష్ మరణ వార్త విన్న తర్వాత పలువురు సెలబ్రెటీలు ఆయన మృతికి సంతాపం తెలిపారు. మహేష్ మరణంతో సినిమా ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి.