శ్రీదేవి పార్థివదేహనికి చిరంజీవి నివాళి

Update: 2018-02-28 07:05 GMT

శ్రీదేవి పార్థివదేహనికి మెగాస్టార్ చిరంజీవి నివాళులర్పించారు. సెలబ్రేషన్ క్లబ్ లో ఉన్న శ్రీదేవి భౌతికకాయాన్ని సందర్శించిన చిరంజీవి.. ఆమె కుటుంబసభ్యులకు సానూభూతి తెలిపారు. శ్రీదేవితో చిరంజీవి అనుబంధం విడదీయలేనిది. శ్రీదేవితో కలిసి చిరు జగదేకవీరుడు అతిలోక సుందరి, ఎస్పీ పరుశరాం, రాణీకాసుల రంగమ్మ సినిమాల్లో నటించారు. జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా చిత్రీకరణ నాటి విషయాలను గుర్తు చేసుకున్నారు. ఆమెతో నటించింది మూడు సినిమాలే అయినా.. శ్రీదేవితో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉంది. అందుకే శ్రీదేవి పార్థివదేహన్ని  చూసి చిరంజీవి చలించిపోయారు.
 

Similar News