తానెవరో , తనపేరేంటో చెబితే మెగాస్టార్ చిరంజీవి ఇంట్లోనుంచి బయటకు వస్తారని చిరు ఇంటివద్ద ఓ మహిళా భీష్మించుకు కూర్చుంది.. వివరాల్లోకి వెళ్తే.. నిన్న పశ్చిమగోదావరి జిల్లా కు చెందిన శ్రీదేవి అనే మహిళా "నేను శ్రీదేవిని. నా పేరు చెప్తే చిరంజీవి బయటకు వస్తారు" అని చెప్పి అక్కడే కూర్చుంది. అయితే సెక్యూరిటీ గార్డులు అక్కడి నుంచి వెళ్లాల్సిందిగా ఎంత చెప్పినా వినిపించుకోలేదు. ఉదయం 10 గంటల వరకు ఇంటి వద్దనే కూర్చుని న్యూసెన్స్కు పాల్పడడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. మహిళా పోలీసులు ఆమెన పోలీస్స్టేషన్కు తరలించి విచారించగా విచారణలో ఆమె పొంతన లేని సమాధానాలు చెప్తుంది..