అలిపిరి ఘటనపై డిప్యూటీ సీఎం, హోంమంత్రి చినరాజప్ప భిన్నంగా స్పందించారు. అసలు అమిత్షా వాహనంపై రాళ్ల దాడే జరగలేదన్నారు. కేవలం వెనకున్న వాహనాలపై ఆందోళనకారులు రాళ్లు వేశారని అన్నారు. అయితే బీజేపీ కార్యకర్తలు రెచ్చగొట్టడం వల్లే.... అలిపిరి ఘటన జరిగినట్లు తెలుస్తోందన్నారు. అయితే శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే... ఎవరినైనా ఉపేక్షించేది లేదన్నారు. తెలుగుదేశం ముసుగులో దాడి జరిగి ఉండొచ్చని చినరాజప్ప అనుమానం వ్యక్తంచేశారు.