విజయవాడలోని దుర్గ గుడిలో అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. పెళ్లి బృందంలోని మహిళలు బస చేసిన సీవీ రెడ్డి చారిటీస్ డార్మిటరీలో సీసీ కెమెరాలు అమర్చారు. మహిళలు దుస్తులు మార్చుకునే హాలులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. లగేజీ తీసుకెళ్లేందుకు వచ్చిన పెళ్లి బృందం సభ్యులు...సీసీ కెమెరాలను గుర్తించారు. దీనిపై అధికారులను నిలదీయడంతో పొంతనలేని సమాధానాలు చెబుతున్నారు. సెక్యూరిటీ సిబ్బంది మాత్రం మూడు రోజుల నుంచి సీసీ కెమెరాలు పని చేయడం లేదంటున్నారు. ఆలయ ఉద్యోగులు మాత్రం కెమెరాలకు కనెక్షన్ ఇవ్వలేదని తప్పును కప్పి పుచ్చుకుంటున్నారు.