ప్రముఖ నటి శ్రీదేవి భర్త బోనీ కపూర్ మొదటి భార్య మోనా సౌరీకపూర్ కుమారుడుకి, శ్రీదేవికి మధ్య చాలాకాలంగా వివాదాలు ఉన్నాయని ఎంతో కాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే శ్రీదేవి దుబాయ్లోని ఓ హోటల్లో బాత్టబ్లో పడి కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బోనీ కపూర్ మొదటి భార్య కుమారుడు అర్జున్కపూర్.. శ్రీదేవితో తనకున్న అనుబంధాన్ని వెల్లడించాడు.
ఒకప్పుడు జరిగిన ఓ ఇంటర్వ్యూలో శ్రీదేవిని కానీ, ఆమె కూతుళ్లను కానీ కలిసేదే లేదంటూ చెప్పిన అర్జున్ కపూర్.. శ్రీదేవి మరణం తర్వాత మాత్రం ఆమెపై నాకెలాంటి ద్వేషం లేదని అంటున్నాడు. దుబాయ్లో శ్రీదేవి మరణంతో.. గత రెండు మూడు రోజులుగా అర్జున్ కపూర్పై విమర్శలు వెల్లువెత్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఆ విమర్శలకు అరికట్టేలా తాజాగా ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపాడు. ‘శ్రీదేవి అంటే నాకెంతో గౌరవం అని, మా నాన్న జీవితంలోకి ఎవరొచ్చినా గౌరవిస్తానని, అలాగే శ్రీదేవిని కూడా’ అని చెప్పుకొచ్చాడు అర్జున్ కపూర్. శ్రీదేవిని కడసారి చూసేందుకు ప్రస్తుతం ముంబైలోని ఆమె నివాసం వద్ద బారులు తీరారు అభిమానులు.