దుమ్ము రేపుతున్న భాగమతి.. 50 కోట్ల క్లబ్‌లో అనుష్క

Update: 2018-02-01 06:18 GMT

బాహుబలి తర్వాత అనుష్క శెట్టి నటించిన భాగమతి చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్నది. యూవీ క్రియేషన్స్ రూపొందించిన ఈ చిత్రం అందరి అంచనాల తలకిందులు చేస్తూ కలెక్షన్ల పరంగా దూసుకెళ్తున్నది. మంగళవారం జరిగిన భాగమతి థ్యాంక్యూ మీట్‌లో నిర్మాతలు, డిస్టిబ్యూటర్ దిల్ రాజు సంతోషాన్ని వ్యక్తం చేశారు.

తెలుగుతో పాటు తమిళ .. మలయాళ భాషల్లోను .. ఓవర్సీస్ లోను కలుపుకుని, తొలివారంతంలో ఈ సినిమా 36 కోట్లకి పైగా గ్రాస్ ను వసూలు చేసిందని చెబుతున్నారు. వీకెండ్ తరువాత కూడా ఈ సినిమా వసూళ్ల పరంగా అదే జోరును కంటిన్యూ చేస్తుండటం విశేషం. తెలుగు .. తమిళ.. మలయాళ .. ఓవర్సీస్ వసూళ్లను కలుపుకుంటే, తొలివారం ముగిసేనాటికీ ఈ సినిమా 50 కోట్ల క్లబ్ లోకి చేరిపోవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కథ .. కథనాలు .. వాటికి తగిన గ్రాఫిక్స్ .. అనుష్కకి గల క్రేజ్ ఇందుకు కారణమని అంటున్నారు.  

Similar News