ప్రస్తుతం సినీ ఇండస్ట్రీని ‘మీటూ’ మూమెంట్ కుదిపేస్తోంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. లండన్లో ఉన్న తాను గతరాత్రే ఇండియాకు వచ్చానని.. ఇక్కడ జరుగుతున్నదంతా తెలుసుకున్నానని.. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏ ఒక్కరితోనూ ఇకపై పనిచేసేది లేదని ఆయన ట్విటర్ ద్వారా స్పష్టం చేశారు. అక్షయ్ ప్రస్తుతం నటిస్తున్న ‘హౌస్ఫుల్ 4’ మూవీ డైరెక్టర్ సాజిద్ ఖాన్పై కూడా లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయన ఈ సినిమా షూటింగ్ను క్యాన్సిల్ చేసుకున్నారు. గత రాత్రి ఇటలీ నుండి ఇండియాకి వచ్చాను. ఇక్కడి వార్తలు నన్ను చాలా డిస్ట్రబ్ చేశాయి. హౌజ్ ఫుల్ 4 నిర్మాతలకి ఫోన్ చేసి అనుమానితులుగా ఉన్న వారి విచారణ పూర్తయ్యే వరకు సినిమా షూటింగ్ నిలిపివేయాలని కోరాను. ఈ సమయంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఎంతైన అవసరం. ఆరోపణలు నిర్ధారణ అయిన వారితో కలిసి ఎప్పటికి పనిచేయను. అలాగే వేధింపులకి గురైన వారందరికి న్యాయం జరగాలని కోరుకుంటున్నానని అక్షయ్ ట్వీట్లో పేర్కొన్నారు.