రిలయన్స్ జియో రాకతో టెలికాం సంస్థల మధ్య టారిఫ్ వార్ నడుస్తోంది. ఉన్న వినియోగదారులను నిలబెట్టుకోవడంతో పాటు, కొత్త వారిని ఆకర్షించేందుకు అన్ని టెలికాం సంస్థలు ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. దేశీయ అతిపెద్ద ప్రైవేటు టెలికాం సంస్థ ఎయిర్టెల్ తన ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం భారీ డేటా ప్లాన్ తీసుకొచ్చింది. రూ. 199కే అపరిమిత కాల్స్తో పాటు రోజుకు 1 జీబీ డాటా, లోకల్ అండ్ నేషనల్ ఎస్ఎంఎస్లను 28 రోజుల పాటు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అయితే ఆఫర్కు చిన్న షరత్ పెట్టింది. ఇన్కమింగ్ కాల్స్కు మాత్రమే రోమింగ్ ఉచితంగా ఇస్తూ.. ఔట్గోయింగ్ కాల్స్కి రోమింగ్ చార్జీ వేస్తున్నట్లు ఎయిటెల్ తన ఆఫర్లో పేర్కొంది.
ఇకపోతే.. రూ. 349తో రీచార్జ్ చేసుకునే వారికి 1.5 జీబీ 3జి/4జి డాటా, అపరిమిత కాల్స్తో పాటు.. లోకల్ అండ్ నేషనల్ ఎస్ఎంఎస్లు 28 రోజులపాటు ఇవ్వనుంది.
రూ. 448తో రీచార్జ్ చేసుకుంటే.. 1.5 జీబీ 3జి/4జి డాటా, అపరిమిత కాల్స్ మరియు ఎస్ఎంఎస్లతో 70 రోజుల పాటు ఈ ఆఫర్ వర్తిస్తుంది. వీటితోపాటు రూ. 549, 799 ప్యాకేజీలు కూడా ఉన్నాయి.