నేడే వైసీపీ కేంద్ర కార్యాలయం ప్రారంభం
గుంటూరు జిల్లా తాడేపల్లిలో వైసీపీ రాష్ట్ర కార్యాలయం. సీఎం వైఎస్ జగన్చే ప్రారంభం. సాయంత్రం ఐదు గంటలదాక విద్యాశాఖ అధికారులతో సీఎం జగన్ సమీక్ష
గుంటూరు జిల్లా తాడేపల్లిలో వైసీపీ రాష్ట్ర కార్యాలయాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభిస్తారు. ఉదయం 11 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో జగన్ తో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొంటారు. మధ్యాహ్నం మూడున్నర నుంచి సాయంత్రం ఐదు గంటలదాక విద్యాశాఖ అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు పలువురు నేతలు హాజరుకానున్నారు. కొత్త ఆఫీసులో అన్ని హంగులు ఏర్పాటు చేశారు. బ్యాక్ ఆఫీసు, సోషల్ మీడియా విభాగం, మీడియా కోఆర్డినేషన్ ఇలా పార్టీకి చెందిన విభాగాలన్నీ ఇక్కడి నుంచే పని చేస్తాయి.