సంప్రదాయ పద్ధతిలో శ్రీవారి దర్శనానికి వైఎస్‌ జగన్‌

Update: 2019-01-10 13:08 GMT

ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కొద్దిసేపటి క్రితం శ్రీవారి సర్వ దర్శనానికి బయలు దేరారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3700 కిలోమీటర్ల పాదయాత్రను దిగ్విజయంగా పూర్తిచేసుకున్న వైఎస్‌ జగన్‌ శ్రీవారి దర్శనం చేసుకునేందుకు కాలినడకన ఇవాళ మధ్యాహ్నం తిరుమలకు చేరుకున్నారు.. ఒక సామాన్య భక్తుడిలా అలిపరి మార్గంలో కాలినడకన..

తనతోపాటు కాలినడకన శ్రీవారి దర్శనానికి బయలుదేరిన జగన్ వారికి అభివాదం చేసుకుంటూ ముందుకుసాగారు. తిరుమల సంప్రదాయ పద్ధతిలో పంచె కండువా ధరించారు. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడం కోసం. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ గుండా స్వామివారి సర్వ దర్శనానికి వెళ్లరు.

Similar News