తనకి ప్రజల ఆశీస్సులు ఉన్నంత వరకు తనని ఎవరు ఏమి చేయలేరని ఏపి ప్రతిపక్ష నేత మరియు టిడిపి నేత చంద్రబాబు అన్నారు .. వారి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టే ఆనాడు అలిపిరి ఘటన నుండి బయటపడిన విషయాన్ని గుర్తుచేసారు చంద్రబాబు .. జగన్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని అయన మండిపడ్డారు .. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పుతున్నాయని అన్నారు . శాంతి భద్రతలు సరిగ్గా ఉంటేనే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరైనా ముందుకు వస్తారని అయన అన్నారు .. ఉండవల్లి లోని తన నివాసంలో టిడిపి నేతలతో సమావేశం అయిన బాబు ఈ వాఖ్యలు చేసారు.. తనపై అభిమానం చూపించిన వారికీ ఎప్పటికి రుణపడి ఉంటానని అయన చెప్పుకోచ్చారు.. చంద్రబాబు నిన్న రాత్రి హైదరాబాద్ కి చేరుకున్నారు.. మరో రెండు రోజుల పాటు అయన ఇక్కడే ఉంటారు ..