విజయవాడ గోశాల ఆవులు విష ప్రయోగంతో మృతి చెందినట్లు పోస్ట్ మార్టం రిపోర్టులో తేలింది. ఆవుల కడుపులో గడ్డి తప్ప ఇతర పదార్థాలు లేవని డాక్టర్లు తేల్చారు. గోశాలలోని పచ్చగడ్డి, దాణా, నీటి శాంపిల్స్ ను పశు సంవర్థక డాక్టర్లు తీసుకెళ్లారు. మరోవైపు ఆవుల మృతితో దుర్గందభరితమైన గోశాలను నిర్వాహకులు శుభ్రపరుస్తున్నారు.