ఇవాళ నెల్లూరు జిల్లాకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో పాటు పలువురు కేంద్రమంత్రులు రానున్నారు. కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, రైల్వేమంత్రి పియూష్ గోయల్, హోంశాఖ సహాయమంత్రి కిషన్రెడ్డి, బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ రానున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. గూడురు విజయవాడ మధ్య ఇంటర్ సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, కృష్ణపట్నం, ఓబుళాపురం రైల్ లైన్తో పాటు పలు పథకాలను ప్రారంభిస్తారు. దీంతో మూడు రోజుల పాటు ఉపరాష్ట్రపతి నెల్లూరులోనే ఉండనున్నారు.