సీఎంతో చర్చించి మార్పులు తీసుకొస్తాం: టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
తిరుమల తిరుపతి దేవస్థానంలో సమూల మార్పులు తీసుకొస్తామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. నూతన పాలక మండలి ఏర్పడిన తర్వాత తీసుకురావాల్సిన మార్పులపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రొటోకాల్ బ్రేక్ దర్శనాలను కుదించి ప్రతి ఒక్కరికీ సకాలంలో దర్శనం అందేలా చేయడమే తమ ధ్యేయమన్నారు. టీటీడీలో మార్పులపై ముఖ్యమంత్రి, పాలకమండలి సభ్యులతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.