రేపు సూర్యగ్రహణం ..శ్రీవారి దర్శనాలు రద్దు

Update: 2020-06-20 07:08 GMT

సూర్యగ్రహణం సందర్బంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని రేపు మూసివేయనున్నారు. ఈ రాత్రి 8 గంటలా 30 నిమిషాలకు జరగనున్న ఏకాంత సేవ తర్వాత ఆలయం తలుపులు మూసివేయనున్నారు.

రేపు ఉదయం ఉదయం 10 గంటలా 18 నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటా 38 నిమిషాల వరకు గ్రహణం ఉండటంతో 2 గంటలా 30 నిమిషాలకు ఆలయాన్ని తెరవనున్నారు. సాయంత్రం 6 గంటల వరకు సుప్రభాతం, శుద్ధి, పుణ్యాహవచనం, తోమాల సేవ, కొలువు, బంగారు వాకిలి లోపల పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. రాత్రి కైంకర్యాల కారణంగా రేపు శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతించబోమని ఈ విషయాన్ని గమనించాలని ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు తెలిపారు.  

Tags:    

Similar News