టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే తోట త్రిముర్తులు అనుచరులతో కలిసి వైసీపీలో చేరారు. ఏపీ సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువ కప్పుకున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు తోట త్రిమూర్తులు. ఏపీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సమర్ధవంతమైన నేతను ప్రజలు సీఎం గా ఎన్నుకున్నారని చెప్పారు.