చంద్రబాబుకు సెక్యూరిటీ తగ్గించారన్న ఆరోపణలు నిజం కాదు: ఏపీ డీజీపీ సవాంగ్

Update: 2019-06-18 16:03 GMT

ప్రతిపక్ష నేత చంద్రబాబుకు సెక్యూరిటీ తగ్గించారన్న ఆరోపణలు వెలువడ్డ విషయం తెలిసిందే. దీనిపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందిస్తూ, ఆ ఆరోపణల్లో నిజం లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎన్నికల తర్వాత రాజకీయ దాడులు జరుగుతున్నాయనేది అవాస్తవమని, శాంతిభద్రతలపై నిష్పాక్షికంగా ఉండాలని సీఎం జగన్ ఆదేశించినట్టు చెప్పారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారుల బదిలీల్లో రాజకీయ జోక్యం గురించి ఆయన ప్రస్తావిస్తూ, ఇకపై ఇలాంటివి ఉండవని వ్యాఖ్యానించారు. కాగా, ఏపీ ప్రభుత్వం ఆదేశాల మేరకు పోలీసులకు రేపటి నుంచి వీక్లీ ఆఫ్ అమలు కానుంది. ఈ మేరకు ఆదేశాలు వెలువడ్డ విషయం తెలిసిందే. దీనిపై గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ, 'వీక్లీ ఆఫ్' అనేది పోలీస్ సంస్కరణలు, సంక్షేమానికి తొలి అడుగు అని అన్నారు. సీఎం జగన్ నిర్ణయంపై పోలీసులు హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.

Tags:    

Similar News