శ్రీకాకుళం జిల్లా సోంపేటలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పలాసపురం అంగన్వాడీ భవనాన్ని ప్రారంభించడానికి వచ్చిన టిడిపి ఎమ్మెల్యే బెందాళం అశోక్ ను వైసిపి కార్యకర్తలు అడ్డుకున్నారు. ఐదేళ్లుగా ఎటువంటి అభివృద్ధి పనులు చేయకుండా ఇప్పుడు ఎందుకొచ్చారంటూ ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో టిడిపి-వైసిపి వర్గీయులు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కాగా ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో పలువురు గాయపడ్డారు. ఇక పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఇదే అంశంపై ఎమ్మెల్యే అశోక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.