పృథ్వీకి సీఎం జగన్ అదిరిపోయే ఆఫర్!

Update: 2019-07-13 07:32 GMT

సీనీయర్ కమెడియన్ , వైసీపీ నేత పృథ్వీకి ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అదిరపోయే ఆఫర్ ఇచ్చారు. తిరుమల శ్రీవారి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటుతున్న శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్‌కు (ఎస్‌వీబీసీ) చైర్మన్‌గా సినీ నటుడు పృథ్వీని ఏపీ ప్రభుత్వం నియమించారు. దీనిపై ఇప్పటికే పృథ్వీకి సీఎం వైఎస్ జగన్ సమాచారం ఇవ్వగా త్వరలో ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు జారీ కానున్నాయి. ఇటీవలే ఎస్‌వీబీసీ చైర్మన్‌ పదవికి సీనియర్ దర్శకుడు కె.రాఘవేంద్రరావు రాజీనామా చేశారు. ఆయన స్థానంలో పృథ్వీని నియమించనున్నారు. చాలా కాలంగా వైసీపీ తరపున పృథ్వీ ప్రచారం చేస్తున్నారు. అలాగే విశాఖపట్నం మెట్రో పాలిటన్ చైర్మన్‌గా ద్రోణంరాజు శ్రీనివాస్‌ను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

కాగా ప్రజా సంకల్ప యాత్ర పేరుతో వైఎస్ జగన్ రాష్ట్రమంతా పాదయాత్ర చేశారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన పృథ్వీ తన సొంత జిల్లాలో జగన్ పాదయాత్ర సందర్భంగా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. జగన్ సీఎం కావాలి అంటూ కాలినడక తిరుమల వెల్లి స్వామివారిని దర్శించుకొని తలనీలాలు సమర్పించిన విషయం తెలిసిందే. ఇక అప్పట్లో ఆయన వైసీపీ తరుపున ఎన్నికల బరిలో దిగుతారనే ప్రచారం కూడా జోరుగా సాగింది. కానీ అప్పట్లో పృథ్వీ టికెట్ లభించలేదు. అయితే పృథ్వీ ప్రస్తుతం వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న విషయం తెలిసిందే. మొత్తానికి పృథ్వీకి ఈ పదవి దక్కడంతో పార్టీ శ్రేణులు, పృథ్వీ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Full View

Tags:    

Similar News