బీజేపీ ఎంపీని కలిసిన టీడీపీ ఎమ్మెల్యే.. ఆసక్తికరమైన చర్చకు దారి తీసిన ఇరువురి కలయిక

Update: 2019-10-25 05:51 GMT

బీజేపీ ఎంపీ సుజనా చౌదరితో కృష్ణాజిల్లా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కలిశారు. గుంటూరులో పర్యటిస్తున్న సుజనాతో వంశీ భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. అయితే వీరిద్దరి మధ్య ఎలాంటి చర్చలు జరిగాయన్న దానిపై సమాచారం లేకున్నా ఇద్దరూ కలిసి ఉండటం సుజనా ఇంటి ఆవరణలో వంశీ ఉండటం తీవ్ర చర్చకు దారితీస్తోంది. అసలే వంశీ పార్టీ మారుతారనే ప్రచారం ఊపందుకున్న వేళ బీజేపీ ఎంపీ సునజా చౌదరిని కలవడంతో ఆ ప్రచారానికి మరింత ఊపు తెచ్చినట్లైంది.  

Tags:    

Similar News