టీడీపీ నేత నోట..జగన్ పాట: ప్రభుత్వంపై రాయపాటి ప్రశంసల జల్లు

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ప్రశంసలు కురిపించారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పరిపాలన తీరు బాగుందన్నారు టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు.

Update: 2019-08-16 07:00 GMT

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ప్రశంసలు కురిపించారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పరిపాలన తీరు బాగుందన్నారు టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు. నవరత్నాలు చాలామంచి కార్యక్రమని... కేంద్రం సరైన సహకారం అందించాలన్నారు. ఇక తాను ఏ పార్టీలో చేరాలో తర్వలో ప్రకటిస్తానన్నారు మాజీ ఎంపి రాయపాటి సాంబశివరావు. పోలవరం రివర్స్‌ టెండర్‌తో నిర్మాణ వ్యయం మరింత పెరుగుతుందన్నారు. నేడు తిరుమల శ్రీవారిని మాజీ ఎంపి రాయపాటి సాంబశివరావు దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. అయిత గత కొద్దిరోజులుగా రాయపాటి బీజేపీ తీర్థంపుచ్చుకుంటున్నారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. తాజాగా ఆయన సీఎం జగన్ మోహన్ రెడ్డిని ప్రశంసించడం చర్చనీయాంశం అవుతోంది. 

Tags:    

Similar News