కియాపై వైసీపీ ఎంపీ వ్యాఖ్యలు దారుణం: దేవినేని ఉమా
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎంతో కష్టపడి కియా సంస్థను ఏపీకి తీసుకొచ్చారని ఆ పార్టీ నేత దేవినేని ఉమా అన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎంతో కష్టపడి కియా సంస్థను ఏపీకి తీసుకొచ్చారని ఆ పార్టీ నేత దేవినేని ఉమా అన్నారు. కియాపై వైసీపీ ఎంపీ మాధవ్ చేసిన వ్యాఖ్యలు తప్పుబట్టిన ఆయన రాష్ట్రంలో పెట్టుబడిదారులకు వైసీపీ ఏం మేసేజ్ ఇస్తోందని ఆయన ప్రశ్నించారు. తమది పారదర్శక ప్రభుత్వం అని చెప్పుకుంటున్న జగన్ కోస్తా ప్రజల గుండెకాయ అయిన బందరు పోర్టును ఎందుకు రద్దు చేశారని నిలదీశారు. దీనికి సంబంధించి జగన్ రాష్ట్ర ప్రజలకు సంజాయిషీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.