AP Elections 2020: ఏపీ సీఎస్‌కు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేష్‌కుమార్‌ లేఖ

Update: 2020-03-17 06:47 GMT
Neelam Sahani, Ramesh Kumar

ఏపీ సీఎస్‌కు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేష్‌కుమార్‌ లేఖ రాశారు. సీఎస్‌కు మూడు పేజీలతో కూడిన లేఖ రాశారు. ఎన్నికల వాయిదాకు దారితీసిన పరిస్థితులు, ఇతర రాష్ట్రాల్లో తీసుకున్న నిర్ణయాలను లేఖలో వివరించారు. కరోనా వైరస్‌ ప్రభావంతో ఎన్నికలు వాయిదా వేశామని లేఖలో తెలిపారు.

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ తీసుకున్న నిర్ణయంపై సీఎస్‌కు ఈసీ లేఖ రాశారు. పూర్తి కారణాలను వివరిస్తూ మూడు పేజీల లేఖ రాశారు. గతంలో రాజ్‌భవన్‌లో కంటే ముందు ఆర్థిక శాఖలో ఫైనాన్స్‌ వ్యవహారాలను చూశానని ఆర్థిక వ్యవహారాలపై తనకు పూర్తిగా అవగాహన ఉందన్నారు. ఎన్నికలకు ఆర్థిక సంఘం నిధులకు లింక్‌ పెట్టవద్దని లేఖలో సూచించారు.

Tags:    

Similar News