మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అజ్ఞాతం వీడారు. భూవివాదంలో 160, 91 సెక్షన్ల కింద సోమిరెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. వెంకటాచలం పోలీస్ స్టేషన్ కు వచ్చారు సోమిరెడ్డి. ఇడిమేపల్లి భూమికి సంబంధించిన అసలు పత్రాలను పోలీసులకు అంద చేశారు. సోమిరెడ్డి వస్తున్నారని తెలుసుకున్న పలువురు టీడీపీ నాయకులు స్టేషన్ కు చేరుకున్నారు. సోమిరెడ్డి వివరణ పై పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్నది ఆయన అనుచరుల్లో ఉత్కంఠగా మారింది.