టీడీపీ కీలక నేత, రాజమహేంద్రవరం ఎంపీ మురళీమోహన్ సంచలన నిర్ణయం తీసుకున్నారట. ఈసారి ఎన్నికల్లో పోటీచేయకూడదని అనుకుంటున్నారట.తనకు బదులుగా కోడలు రూప కూడా పోటీ చేయకూడదని నిర్ణయం..
తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఎన్నికలకు దూరంగా ఉంటూ.. ఇక నుంచి తాను ఏర్పాటుచేసిన ట్రస్టు కార్యకలాపాలపై దృష్టి పెట్టనున్నట్లు సమాచారం. అమరావతిలో శుక్రవారం రాజమహేంద్రవరం లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే స్థానాలు, ఎంపీ అభ్యర్థులపై చంద్రబాబు సమీక్షించనున్నారు. మురళీమోహన్ కూడా హాజరు కానున్నారు. ఆ సందర్భంగా తన నిర్ణయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలియజేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది.