ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరారెడ్డి వైసీపీలో చేరుతారంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. తప్పుడు వార్తల కథనాలపై రఘువీరారెడ్డి మండిపడ్డారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానన్నారు. ఇలాంటి అసత్య ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. 7, 8 ఏళ్లుగా వివరణ ఇచ్చుకోవడమే సరిపోతుందని రఘువీరారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.