ఏపీ మ్యాప్లో చిట్టచివరన ఉన్న నెల్లూరు జిల్లా కరోనా కేసుల్లో మాత్రం ఫస్ట్ ప్లేస్లో నిలుస్తోంది. ఇప్పటివరకు మొత్తం 32 పాజిటివ్ కేసులు నమోదవడంతో నెల్లూరు జిల్లా ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఢిల్లీలో జరిగిన మత ప్రార్థనల్లో పాల్గొని వచ్చిన వారి వల్లే పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిందని తెలుస్తోంది. ఇప్పటి వరకు జిల్లా నుంచి 253 శాంపుల్స్ ల్యాబ్ కు పంపగా వాటిలో 32 పాజిటివ్ రాగా మరో 21 నెగటివ్ వచ్చింది. మిగతా 178 మంది రిపోర్ట్స్ రావాల్సి ఉండటంతో అందులో ఎన్ని పాజిటివ్ కేసులు రికార్డ్ అవుతాయనే ఆందోళన నెలకొంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 161 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శుక్రవారం ఒక్కరోజే కొత్తగా 12 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ జవహర్ రెడ్డి హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. అత్యధికంగా నెల్లూరులో 32 మంది కరోనా బాధితులు ఉన్నారు.