కోడెల అకాల మరణంపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర దిగ్భాంత్రి వ్యక్తం చేశారు. కోడెల కుటుంబానికి సంతాపం తెలియజేశారు. కోడెల మృతి పట్ల సమగ్ర విచారణ చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. కోడెల మరణం తర్వాత పరిస్థితులు క్షణక్షణం మారుతున్నాయని అన్నారు. మరణానికి సంబంధించిన సాక్షాలు తారుమారు కాకుండా చూడాలని కోరారు.