మరో బాంబు పేల్చిన మంత్రి బొత్స..

Update: 2019-08-26 13:14 GMT

రాజధాని అమరావతిలో ఇన్ సైడర్‌ ట్రేడింగ్‌ పై మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధానిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌ జరిగిందని, వైసీపీ వద్ద పూర్తి సమాచారం ఉందన్నారు. సరైన సమయంలో భూ అక్రమాల చిట్టా బయటపెడతామని, మీడియా మధ్యవర్తిత్వం చేయాల్సిన అవసరం లేదన్నారు. మాజీ కేంద్ర మంత్రి, ప్రస్తుత ఎంపీ.. తనకు రాజధానిలో భూములే లేవంటున్నారని, సవాల్‌ విసిరితే మొత్తం బయటపెడతామన్నారు. ఇక నాలుగు రాజధానుల విషయం టీజీ వెంకటేష్‌నే అడగాలని, పవన్‌ కల్యాణ్‌ గతంలో ఏం మాట్లాడారో, ఇప్పుడేం మాట్లాడారో రికార్డులు చూస్తే తెలుస్తుందన్నారు. త్వరలో రాజధాని కౌలు రైతుల సమస్య పరిష్కరిస్తామని బొత్సా తెలిపారు.

Tags:    

Similar News