అనంతపురం సర్వజన ఆసుపత్రిలో శిశు మరణాల పై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సీరియస్ అయ్యారు. ఆస్పత్రిలో చిన్నపిల్లల అవార్డును మంత్రి సందర్శించారు. చిన్నారుల మరణాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వాసుపత్రులను గత ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. వైద్యసేవలు అందించడంలో నిర్లక్ష్యం కనబరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. శిశు మరణాలపై సీఎం జగన్ కు నివేదిక అందజేయనున్నట్లు మంత్రి తెలిపారు