టీడీపీ నేతలపై వైసీపీ నేత జోగి రమేష్ మండిపడ్డారు. గన్నవరం ఎయిర్పోర్టులో చంద్రబాబును చెక్చేయడంపై ఆ పార్టీ నేతలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు. ఎయిర్పోర్టులోకి జడ్ప్లస్ కేటగిరీలో వెళ్లే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. ప్రతిపక్ష నేత ఎవరున్నా ఎయిర్పోర్టులో చెక్ చేస్తారని చంద్రబాబును కూడా అలానే చెక్చేశారని అన్నారు. సీఎం జగన్ హుందాగా వ్యవహరిస్తున్నారని ఏ ఒక్క వ్యక్తిపై కూడా దాడి జరిగేందుకు వీలులేదని జగన్ ఆదేశాలు జారీ చేశారని తెలిపారు.
అసలు చంద్రబాబు ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయామో కూడా ఆలోచించే పరిస్థితిలో లేరన్నారు. నిన్న వారు మాట్లాడారు వైసీపీ ప్రభుత్వం హత్య రాజకీయాలు చేస్తున్నదని, వైసీపీ అధికారంలోకి వచ్చాకా హత్యలు పెరుగుతున్నాయని దానికి జోగి రమేష్ సమాధానం ఇస్తూ చంద్రబాబుని సూటిగా ప్రశ్నస్తున్నని ఏపీలో హత్యరాజకీయాలకు కేరాఫ్ అడ్రాస్ నారా చంద్రబాబేనని అన్నారు. చంద్రబాబు హాయంలో ఎన్ని హత్య రాజకీయాలు చేశావ్? ఎన్ని కుట్రలు పన్నావ్? ఎన్ని దోపిడిలు, దొంగతనలు చేశావ్ అని, అసలు చరిత్ర మొత్తం ప్రజలకు తెలుసున్నారు. నమ్మిన వారిని నట్టేటా ముంచే సంప్రదాయం ఉన్న వ్యక్తి చంద్రబాబేనని అన్నారు.