జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలి: హోం మంత్రి

Update: 2019-12-03 12:07 GMT
సుచరిత

ఫ్రెండ్లీ పోలీసింగ్‌ విధానాన్ని అవలంభించాల్సిన అవసవరం ఉందన్నారు ఏపీ హోంమంత్రి సుచరిత. గుంటూరు నగరంలోని మహిళా పోలీస్‌స్టేషన్‌ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఫిర్యాదు దారుల సమస్యలను ఆమె అడిగి తెలుసుకున్నారు.

మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదని పోలీసులు కూడా కఠినంగా వ్యవహరించాల్సి ఉందన్నారు. అంతేకాకుండా పరిధి చూడకుండా సంబంధిత ఘటనలపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆమె పోలీసులకు సూచించారు. ఫిర్యాదు దారుల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించరాదని సూచించారు. పోలీసు వ్యవస్థలో మరింత మార్పు చేస్తామని మహిళా పోలీస్‌స్టేషన్లలో మహిళా అధికారులను నియమిస్తామన్నారు.

Tags:    

Similar News