ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా..ఇవాళ అసెంబ్లీ ముట్టడికి ఎమ్మార్పీఎస్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో నేటి ఉదయం ఏపీ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన ఎంఆర్పీఎస్ నాయకులను ఎక్కడికక్కడే పోలీసులు అడ్డుకుంటున్నారు. తుళ్లూరులో పలువురు నేతలను అరెస్ట్ చేశారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ.. ఆటోలో ముట్టడికి బయలుదేరి వెళ్తుండగా పోలీసులు లక్డీకాపూల్ వద్ద అరెస్టు చేశారు. రాజధాని పరిధిలో 144 సెక్షన్ ఉందన్న పోలీసులు.. అసెంబ్లీకి వెళ్లే వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించి పంపిస్తున్నారు. తాడికొండ, పెద్దపరిమి, తుళ్లూరు, రాయపూడి, వెలగపూడి, మందడం, మల్క్పూర్ గ్రామాల్లో పోలీసు బలగాలు మోహరించారు.