అమలాపురం మాజీ ఎంపీ హర్ష కుమారు కచ్చలూరు ప్రమాదంపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. గోదావరిలో కచ్చలూరు వద్ద జరిగిన బోటు ప్రమాదానికి కాకినాడ పోర్టు అధికారి ధర్మశాస్త్ర కారణమని అన్నారు. సహాయక చర్యల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని హర్షకుమార్ ఆరోపించారు. టూరిజం బోట్లకు అక్రమంగా అనుమతులిచ్చింది ధర్మశాస్త్రనే అని హర్షకుమార్ తెలిపారు. రెండు లక్షల లంచం తీసుకుని బోట్లకు అక్రమంగా అనుమతులిచ్చారని హర్షకుమార్ ఆరోపించారు.