ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షలు విద్యార్థులను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పదో తరగతి పరీక్షలపై ఈ సాయంత్రం ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఇప్పటి వరకు అయితే షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నట్లు మంత్రి సురేష్ తెలిపారు.
అయితే ముఖ్యమంత్రి తో సమీక్ష తర్వాత నిర్ణయాన్ని వెల్లడించనున్నట్లు మంత్రి సురేష్ తెలిపారు. పిల్లల ఆరోగ్యాన్ని, భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంటామని మంత్రి సురేష్ వెల్లడించారు. పరీక్షల నిర్వహణపై ఉన్న అన్ని అవకాశాలు పరిశీలిస్తున్నామన్నారు. కర్నాటకలో పదవ తరగతి పరీక్షలు నిర్వహించవచ్చని సుప్రీంకోర్టు కూడా అనుమతి ఇచ్చిందని తెలిపారు.