వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తు వేగవంతం..ఈ రాత్రికి కడపలో బస చేయనున్న డీజీపీ
వైఎస్ వివేకా హత్యకేసులో దర్యాప్తును వేగవంతం చేశారు పోలీసు అధికారులు. మరికాసేపట్లో పోలీసు ఉన్నతాధికారులతో, సిట్ బృందంతో డీజీపీ గౌతమ్ సవాంగ్ మరోసారి సమావేశం కానున్నారు. ఈ ఉదయం మూడున్నర గంటల పాటు డీజీపీ.. ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. అధికారులు వివరాలను బయటికి రానివ్వకుండా అత్యంత గోప్యత పాటిస్తున్నారు. ఈ రాత్రికి కూడా డీజీపీ కడపలోనే బస చేయనున్నారు.