ప్రజావేదిక నిర్మాణంపై సీఎం జగన్‌కు CRDA నివేదిక

Update: 2019-06-23 03:45 GMT

ప్రజావేదిక నిర్మాణంపై సీఎం జగన్‌కు CRDA నివేదిక సమర్పించింది. నిర్మాణ వ్యయం రెండింతలు పెంచినట్టు నివేదికలో అధికారులు వెల్లడించారు. నాలుగు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రారంభించినా ... పూర్తయ్యే నాటికి 7 కోట్ల 59 రూపా‍యలు ఖర్చు చేసినట్టు తెలియజేశారు. అయితే నిర్మాణానికి అవసరమైన అనుమతులు తీసుకొనట్టు ఈ నివేదికలో తెలియజేశారు. ఈ నిర్మాణానికి జలవనరుల శాఖ అనుమతి నిరాకరించినట్టు నివేదికలో తెలియజేశారు. మొత్తం 15 అంశాలతో కూడిన నివేదికను CRDA అధికారులు సీఎం జగన్‌కు అందజేశారు.  

Full View

Tags:    

Similar News