తిరుమలపై కరోనా ఎఫెక్ట్ పడింది. కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడికి టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు టీటీడీ ఈవో అనిల్ సింఘాల్ వెల్లడించారు. శ్రీవారి ఆలయంలోకి భక్తుల ప్రవేశాన్ని నిలిపివేసినట్లు తెలిపారు. శ్రీవారికి అర్చకులు ఏకాంత సేవలు చేస్తారని చెప్పారు. పద్మావతి దేవి ఆలయంలోకి భక్తుల ప్రవేశంపై నిషేధం విధించినట్లు తెలిపారు. దయచేసి తిరుమల కొండపైకి భక్తులు రావొద్దని అనిల్ సింఘాల్ కోరారు.