చంద్రబాబు తరఫున భువనేశ్వరి నామినేషన్‌?

Update: 2019-03-22 01:16 GMT

 టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేడు(శుక్రవారం) నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈసారి చంద్రబాబు తరఫున ఆయన సతీమణి భువనేశ్వరి నామినేషన్ వేయనున్నట్లు తెలుస్తోంది. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచి చంద్రబాబు తరఫున ప్రతిసారీ ఎవరో ఒకరు నామినేషన్‌ దాఖలు చేసేవారు. గత రెండు దఫాలు మాత్రం ఆయన కుమారుడు మంత్రి లోకేశ్‌తో నామినేషన్‌ వేయిస్తున్నారు. ఈసారి మాత్రం భువనేశ్వరి నామినేషన్ పాత్రలను సమర్పించనున్నట్టు సమాచారం.  

Similar News