గుంటూరు జిల్లాలో వరద.. ప్రభుత్వం సృష్టించిన విపత్తు అని విమర్శించారు మాజీ సీఎం చంద్రబాబు. వేమూరు నియోజకవర్గంలో వరద ముంపు ప్రాంతాలను ఆయన పరిశీలించారు. రిజర్వాయర్లు అన్ని ఖాళీగా ఉన్నాయని, ఓ పద్దతి ప్రకారం నీరు వదిలితే ఇబ్బంది వచ్చేది కాదని అన్నారు. 50 వేల ఎకరాల్లో పంట నీట మునిగిందన్నారు. వరద వచ్చి వారం దాటినా సహాయక చర్యలు చేపట్టలేదని విమర్శించారు చంద్రబాబు.