తమాషాలు చేస్తే ఊరుకోను : చంద్రబాబు

Update: 2019-10-10 16:06 GMT

ఓటమి కారణంగా కార్యకర్తలు కుంగిపోకూడదన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. రాష్ట్రంలో పోలీసులు అత్యుత్సాహం చూపిస్తున్నారని మండిపడ్డారు. శాంతిభద్రతలు కాపాడాటంపై పోలీసులు దృష్టిపెట్టాలని ఆయన సూచించారు. విశాఖలో కార్యకర్తలతో జరిగిన సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు.. హుద్‌హుద్, తిత్లీ, వంటి పెను తుపాన్లు వచ్చినప్పుడు తాము ప్రజల మధ్యే ఉన్నామని గుర్తు చేశారు. గోదావరి, కృష్ణా వరదలు వస్తే సీఎం జగన్ జెరూసలేం, అమెరికాల్లో పర్యటించారని విమర్శించారు. టీడీపీకి ప్రతిపక్ష పాత్ర కొత్తేమీ కాదన్న చంద్రబాబు.. తాను మంచికి మంచిగా ఉంటానని, తమాషాలు చేస్తే ఊరుకోనని హెచ్చరించారు. 

Tags:    

Similar News