కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు : ఇద్దరి మృతి

Update: 2019-06-14 07:48 GMT

ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లాలో ఈరోజు ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని బొబ్బిలి పారిశ్రామికవాడలో ఉన్న బాలాజీ కెమికల్స్ లో ఈరోజు మధ్యాహ్నం ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఫ్యాక్టరీలో ఏర్పాటుచేసిన బాయిలర్ ఒక్కసారిగా పేలిపోయింది.

ఈ దుర్ఘటనలో బొబ్బిలి మండలానికి చెందిన జగదీశ్, బాడంగి మండలానికి చెందిన సురేష్ తీవ్రగాయాలతో అక్కడికక్కడే చనిపోయారు. మరో 10 మందికి తీవ్రగాయాలు కాగా, వీరిని తోటి కార్మికులు హుటాహుటిన బొబ్బిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ఈ ప్రమాదంపై కేసు నమోదుచేసిన బొబ్బిలి పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News